23, ఏప్రిల్ 2009, గురువారం

బేష్....బేష్....పల్లెలే బెష్......


పల్లెలే దేశానికి పట్టు కొమ్మలని పెద్దలు ఏనాడో చెప్పారు. ఆర్ధిక మాంద్యంవచ్చి ప్రపంచమంతా అల్లాడుతుంటే మన మన రాష్ట్రంలోని పల్లెలు ఎంతో నిబ్బరంగా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి నగరాల్లో, పట్టణాల్లో కొనుగోలు శక్తి పడిపోతే...పల్లెవాసుల కొనుగోలు శక్తి రెండు మూడు నెలల్లో కొంత పెరిగిందట. రుణాల రద్దు, పంటలు చేతికిరావడం, మద్దతు ధరలు పెరగడం వంటి కారణాల రీత్యా రైతులు కాస్తోకూస్తో ఆర్ధికంగా నిలుదొక్కుకున్నారు. పొదుపు చేసే అలవాటు ఉండటం పట్టణాలతో పోలిస్తే కొన్ని రకాల వస్తువుల వినియేగం తక్కువగా ఉండడం కూడా కొనుగోలు శక్తి పెరగడానికి కారణం. పట్టణాల్లో హైటెక్ అంటూ జనం జేబులు ఖాళీ చేస్తున్న మాల్స్ వెలవెలబోతుంటే..... పల్లెల్లో కిరాణా షాపుల్లో వ్యాపారాలు జోరందుకిన్నాయి. పల్లెలన్నీ పచ్చగా ఉన్నాయి. కాబట్టే ఈ మాత్రమైనా ధరలున్నాయి.....లేకపోతే ఇంకెంత పెరిగిపోయేవో..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి